కూటమి మేనిఫెస్టో ప్రజల గుండెచప్పుడు
ABN , Publish Date - May 05 , 2024 | 12:05 AM
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల గుండెచప్పుడు అని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మెంటాడ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల గుండెచప్పుడు అని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని పోరాం, పెదమేడపల్లి, జక్కువ, కూనేరు, ఉద్ధంగి, గురమ్మవలస, కుంఠినవలస, పెద చామలాపల్లి, తదితర సుమారు పది గ్రామాల్లో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ఆమె వివరించారు. అందరి ఆశీర్వాదంతో తాను గెలిచిన వెంటనే ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. అన్ని గ్రామాల్లో సంధ్యారాణికి ఘన స్వాగతం లభించింది. స్థానికులు ఆమెకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు చలుమూరి వెంకటరావు, అన్నవరం, ముసలినాయుడు, అనిల్, రెడ్డి ఎర్నాయుడు, రెడ్డి గోవింద్, కంచు వెంకటి, టి.గోవింద్ తదితరులు పాల్గొన్నారు.