Home » Andhra Pradesh » Vizianagaram
మల్లి గ్రామ సమీపంలోగల గురుకుల ప్రతిభా కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికిగాను దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని ప్రజల కోరిక మేరకు అదనపు పీహెచ్సీ మంజూరు అయినట్టు అధికారిక ఉత్తర్వులు వచ్చాయని మరుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి సాయికృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు.
విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి ఈవీఎంల స్ట్రాంగ్రూంను నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన ఘటనపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు.
సీబీఎస్ఈ సిలబస్పై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకు ని విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి పగడాలమ్మ ఉపాధ్యాయులకు కోరారు.
విజయనగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నీటి సరఫరాకు అంతరాయం కలు గుతుందని నగరపాలక సంస్థ కమి షనర్ మల్లయ్యనా యుడు శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. విజయన గరం నగరపాలక సంస్థకు నీటి సరఫరా అవుతున్న ముషి డిపల్లి వాటర్వర్క్స్నుంచి కంటోన్మెంట్రిజర్వాయర్ వరకూ గల పైపుల్లో ఏర్పడిన లీకులను ఆదివారం సరిచేయను న్నట్లు పేర్కొన్నారు. దీంతో కంటోన్మెంట్ ప్రాంతంలోని కణ పాక,కేఎల్పురం, గంజిపేట, కంబోయివీధి, బాలాజీ మార్కె ట్, సంజీవరావు కాలనీ, గొల్లవీధి పార్క్రోడ్డు, బాలాజీనగర్ ట్యాంకు బండు, రైల్వే స్టేషన్ రోడ్డు, బాలాజీనగర్, తోట పాలెం, సిద్దార్థనగర్, ప్రదీప్నగర్, కొతఅగ్రహరంప్రాంతం లోని పుచ్చలవీధి,హుకుంపేట, లంకాపట్టణం, తూర్పు బలి జి వీధి, పడమట బలిజివీధి, నాగవంశంవీధి, కొత్తదే వర వీధి, బొండాడవీధి, ఉల్లివీధి, సంతపేట, గొల్లవీధి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాని నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యా యులు సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘ నాయ కులు కోరారు. ఈ మేరకు విజయనగరంలో శుక్రవారం డీఆర్వో ఎస్డీ అనితకు వినతిపత్రం అందజేశారు. పీవో, ఏపీవో, ఓపీవో లకు మూడురోజులు రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలిపారు. అయితే డ్యూటీ సర్టిఫికేట్లు మంజూరుచేయాలని కోరారు. అన్ని నియోజకవర్గాల రిసీవింగ్ సెంటర్లు విజయనగరంలో ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారని, ఇటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమెకు విన్నవిం చారు. గజపతినగరం నియోజకవర్గంలోని కొత్తరంగరాజపురం లో విధులు నిర్వహించిన పీవోపై దాడి చేసిన వారిపై ఇప్పటికే ఎప్ఐఆర్నమోదయ్యిందని, చర్యలుతీసుకుంటున్నామని డీఆర్వో అనిత తెలిపారు.కార్యక్రమంలోని యూటీఎఫ్, పీఆర్టీయూ నాయకులు ఈశ్వరరావు, రమణ ఎస్టీయూ,ఆపస్ రాష్ట్ర కార్య దర్శులు శ్యామ్కుమార్,రామునాయుడు పాల్గొన్నారు.
ఖరీఫ్కు సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, నాట్లు వేసేందుకు అనుగుణంగా రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకోవాలని ఏవో శ్యామలరావుసూచించారు. మండలంలోని పారాదిలో వ్యవ సాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ రసాయనఎరువుల వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. భూమిసారవంతం చేసేందుకువీలుగా పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపై రైతులు దృష్టిపెట్టాలని కోరారు.సమావేశంలో వ్యవసాయ సహాయకురాలు రేజేటి ఉష పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జోగారావు, సీహెచ్ సూరిబాబులు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయనగరంలోని అమర్భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశం లో వారు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో పోలింగ్ విధులకు హాజరైన రిజర్వ్ పీఓ, ఏపీఓ, ఓపీఓలకు గౌరవవేతనం చెల్లించాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగ,ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాం డ్చేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పీఓపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు వి.గోవింద రావు, రాంబాబు, నాగేశ్వరరావు, బంగారయ్య, పడాల రమణ పాల్గొన్నారు.
రాజాంలోని జీఎంఆర్ఐటీ కేంద్రంగా శుక్రవారం జరిగిన ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు 20 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 300 మందికి గాను 289 మంది, రెండోపూట జరిగిన పరీక్షకు 301మందికి 292 మంది హాజరయ్యారు.20 మంది గైర్హాజరయ్యార ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు.
:గ్రామాల్లో ఎన్నికలఫలితాల అనంతరం ఎవరైనా గొడవలు సృష్టిం చేవిధంగా వ్యవహరిస్తే కేసులు నమోదుచేస్తామని ట్రైనీ డీఎస్పీ మహేంద్ర హెచ్చరించారు.శుక్రవారం కొండచాకరాపల్లి, కొప్పర గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు చట్ట రీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శీనివాసరరావు, ఎస్ఐ జనార్దనరావు పాల్గొన్నారు.