రాష్ట్రాభివృద్ధి కోసమే పొత్తు
ABN , Publish Date - May 05 , 2024 | 12:01 AM
రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయచంద్ర అన్నారు.
పార్వతీపురం రూరల్: రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయచంద్ర అన్నారు. ములగ, పిండిలోవ, వెలగవలస తదితర గ్రామాల్లో ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ప్రతిఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటువేసి, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ నాయకులు బోనుదేవి చంద్రమౌళి, గొట్టాపు వెంకటనాయుడు, గొట్టాపు గౌరీశ్వరి, వాసుపల్లి గణేష్, చొక్కా అచ్యుత, చుక్క పోలినాయు డు, కొత్తాడ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సంగవలస పంచాయతీలో విజయచంద్రకు ఘన స్వాగతం లభించింది. అమరాపు రామకృష్ణ పాల్గొన్నారు.
పార్వతీపురం మండలంలోరి బంటువానివలస, కోటవానివలస గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. వీరిని కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర పార్టీలోకి ఆహ్వానించారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పట్టణానికి చెందిన వై.నిర్మలకుమారి, పెదబొండపల్లికి చెందిన మండల ఫకీర్ తన అనుచరులతో టీడీపీలో చేరారు. ఫకీర్ భార్య సూర్యకుమారి స్థానిక ఎంపీటీసీ గా ఉన్నారు. కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర శనివారం వీరిని టీడీపీలోకి ఆహ్వానించారు.
జిల్లా కేంద్రం 15 వార్డుల్లో కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర శనివారం ప్రచారం నిర్వహిం చారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టీడీపీ నాయకులు డా.చీకటి భద్రినారాయణ, నిర్మలాకుమారి, కోలా మధు, బడే గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.