Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - May 05 , 2024 | 12:04 AM

టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

కురుపాం: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం ఆమె టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యర్శి వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌తో కలిసి మండలంలోని తిత్తిరి, వలసబల్లేరు, నీలకంఠాపురం, ఊసకొండ, వబ్బంగి పంచా యతీల్లోగల గిరిజన గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో వారికి అపూర్వ ఆదరణ లభించింది. ఈసందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ తమ ఇంటి ఆడపిల్లగా ఎలా ఆదరణ చూపుతు న్నరో అలాగే సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కడ్రక మల్లేష్‌, తెలుగు యువ త అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్‌, టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య, బీజేపీ నాయకు డు ఎన్‌.దూళికేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ ఆరిక విప్లవకుమార్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

గరుగుబిల్లి: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతలను గెలిపించాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు శనివారం రావుపల్లిలో ప్రచారం చేశారు. అక్కేన మధుసూదనరావు, ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.తవిటినాయుడు, ముదిలిబాబు విజయవాంకుశం, పి.పూర్ణచంద్రరావు, కె.భరత్‌కుమార్‌, జి.లక్ష్ముంనాయుడు, కె.బలరాంనాయుడు, ఎం.సురేష్‌, ఎన్‌.సింహా చలంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని లవముముట్ట నెల్లికి, ఎక్కువ వెనాకబడి తదితర గ్రామాల్లో శనివారం టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్‌ పాడి శుద్ధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:04 AM