Share News

పార్టీ మారారని వైసీపీ నేతల అకృత్యం

ABN , Publish Date - May 04 , 2024 | 11:40 PM

‘గ్రామానికి కనీసం రోడ్డు వేసుకోలేకపోయాం. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే ఏం లాభం’ అనుకుని మందస మండలం కేసుపురం గ్రామంలో వైసీపీకి చెందిన కొందరు యువకులు గత నెలలో గౌతు శిరీష ఆధ్వర్యాన టీడీపీలో చేరారు.

పార్టీ మారారని వైసీపీ నేతల అకృత్యం
జీడితోటను పరిశీలిస్తున్న మాజీమంత్రి గౌతు శివాజీ

తోటలో జీడి, మునగ చెట్లు నరికివేత

హరిపురం, మే 4: ‘గ్రామానికి కనీసం రోడ్డు వేసుకోలేకపోయాం. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే ఏం లాభం’ అనుకుని మందస మండలం కేసుపురం గ్రామంలో వైసీపీకి చెందిన కొందరు యువకులు గత నెలలో గౌతు శిరీష ఆధ్వర్యాన టీడీపీలో చేరారు. చేరిన వారిలో బొడ్డు మోహన్‌కు చెందిన జీడితోటలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జీడి, మునగ చెట్లను నరికివేశారు. పార్టీ మారినందుకు కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొద్దిరోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నరికివేతకు గురైన తోటను టీడీపీ నేత, మాజీ మంత్రి గౌతు శివాజీ, పలువురు టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. వైసీపీ నాయకులు సైకోల్లా మారారని, పచ్చని చెట్లను నరికివేయటం ఘోరమైన తప్పిదమమని ఆయన అన్నారు. ఈ దుశ్చర్యపై మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారితే ఇలాంటి దౌర్జన్యాలకు దిగడం భావ్యంకాదని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతాయని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

Updated Date - May 04 , 2024 | 11:40 PM