Share News

నాలుగు తులాల పుస్తెల తాడు చోరీ

ABN , Publish Date - May 03 , 2024 | 11:35 PM

జమ్ము గ్రామంలో గురువారం రాత్రి ముసుగు దొంగలు ప్రవేశించి చోరీకి పాల్ప డ్డారు.

నాలుగు తులాల పుస్తెల తాడు చోరీ

నరసన్నపేట: జమ్ము గ్రామంలో గురువారం రాత్రి ముసుగు దొంగలు ప్రవేశించి చోరీకి పాల్ప డ్డారు. సాధు లచ్చయ్యకు చెందిన ఇంటి తలుపులను గునపాంతో తొలగించేం దుకు ప్రయత్నిం చగా కుటుంబ సభ్యులు మేల్కొని కేకలు వేశారు. దీంతో దొంగలు పారి పోయిన గంట వ్యవధిలోనే వాన సింహాచలం ఇంటి తలుపులను పగులగొట్టి ఇంట్లో నిద్రి స్తున్న సింహాచలం కుమార్తె శిరీష మెడలోని నాలుగు తులాలు పుస్తెలతాడును దొంగి లించారు. ఆమెకు తెలివివచ్చి కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. గ్రామస్థులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. సింహాచలం ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 11:35 PM