7న బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ రాక
ABN , Publish Date - May 04 , 2024 | 11:42 PM
బీజేపీ అగ్రనేత రాజ్నాథ్సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న జిల్లాకు రానున్నారు.
రణస్థలం, మే 4: బీజేపీ అగ్రనేత రాజ్నాథ్సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల సాయుధ పోలీస్ మైదానంలో హెలీప్యాడ్ వద్దకు ఆ రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటారు. 12.20 గంటల నుంచి 1.10 గంటల వరకు బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతుగా నిర్వహించనున్న సభలో ప్రసంగించనున్నారు. 1:20 నిమిషాలకు ఇక్కడ నుంచి విశాఖపట్నం బయలు దేరతారు. పర్యటన విజయవంతం చేసేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.