చెరువుకొమ్ముపాలెంలో వైసీపీకి షాక్
ABN , Publish Date - May 05 , 2024 | 12:30 AM
మేయర్ గంగాడ సుజాత డివి జన్లో వైసీపీకి భారీ షాక్ తగి లింది. డివిజన్ పరిధిలోని చెరువు కొమ్ముపాలెంకు చెందిన వైసీపీ ద ళిత నాయకుడు జడ సుధాకర్ శనివారం టీడీపీలో చేరారు.
సీనియర్ నేత జడ సుధాకర్ టీడీపీలోకి..
ఒంగోలు (కార్పొరేషన్), మే 4 : మేయర్ గంగాడ సుజాత డివి జన్లో వైసీపీకి భారీ షాక్ తగి లింది. డివిజన్ పరిధిలోని చెరువు కొమ్ముపాలెంకు చెందిన వైసీపీ ద ళిత నాయకుడు జడ సుధాకర్ శనివారం టీడీపీలో చేరారు. గత ముప్పైఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్, వైసీపీలో కీలకనేతగా ఉ న్న సుధాకర్ ఇప్పటి వరకు ఆ పార్టీల గెలుపుకోసం కృషి చేశారు. అయితే వైసీపీ అ రాచకాలు, రెడ్డి సామాజికవ ర్గం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చే శారు. ఈ మేరకు దామచర్ల జనార్దన్ను కలిసి టీడీపీలో చేరారు. కాగా ఇందుకు సం బంధించి ఆదివారం సాయంత్రం ఆ గ్రామంలో భారీ సభ ఏర్పాటు చేశారు. కార్యక్ర మానికి టీడీపీ కూటమి అభ్యర్ధి దామచర్ల ముఖ్యఅతిథిగా హాజరు కానుండగా, ఆ కార్యక్ర మంలో దళిత సామాజిక వర్గం ప్రజలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఇప్పటి వరకు వైసీసీకి కీలకంగా, ముఖ్యనేతగా వ్యవహరించిన సుధాకర్ పా ర్టీలో చేరడంతో వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్లుయింది.