Home » Andhra Pradesh » Prakasam
సార్వత్రిక ఎన్నికలు ముగిసి నాలుగు రోజులవుతోంది. ఫలితాలు తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు గెలుపోటములపై ఉత్కంఠతో ఉన్నారు.
చెరువులకు సాగునీటిని అందించే పంట కాలువ మురికి కాలువ కంటే అధ్వానంగా తయారైంది. దీంతో వర్షం నీరంతా చెరువులకు చేరకుండా వాగుల ద్వారా వృథాగా పోతోంది.
టీడీపీ వర్గీయులపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. పోలింగ్ సందర్భంగా మండలంలోని బొట్లపాలెంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకాలు దాడిచేసి గాయపరిచిన విషయం విదితమే. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహిస్తూ బాధితులపై అక్రమ కేసులు బనాయించారు. ఈనేపథ్యంలో శుక్రవారం బాలాజీ బొట్లపాలెం వచ్చారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.
ఈఏడాది పొగాకు ధరలు బాగానే ఉన్నప్పటికి లో గ్రేడ్ రకం మార్కెట్ స్థిరంగా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లోగ్రేడ్లోని పచ్చ, మాడు, బ్రౌన్ రకం బేళ్లకు ఒక్కోరోజు ఒక్కోరకంగా ధరలను వ్యాపారులు ఇస్తున్నారన్నారు.
ఈ ఏడాది ముందస్తు వానలు రైతులను మురిపిస్తున్నాయి. తొలకరి సాగుకు సానుకూల పరిస్థితిని కల్పించాయి. ఈనెలలో ఇప్పటికే జిల్లాలోని దాదాపు సగం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయన్న సంకేతాలు వాతావరణశాఖ నుంచి అందుతున్నాయి. తాజా వర్షాలతో పలు ప్రాంతాల్లో దుక్కులు దున్నకానికి సిద్ధమవుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అఽభ్యర్థులు ఓటర్లును ఆకట్టుకునేందుకు రూ.కోట్లు కుమ్మరించారు. ప్రలోభాలు, పంపకాలకేఉమ్మడి జిల్లాలో రూ.వెయ్యి కోట్లకుపైన వెచ్చించినట్లు అంచనా. ప్రచారం, ఇతరత్రా ఖర్చులు దీనికి అదనం. ఎన్నికల ఖర్చు విషయంలో ఒంగోలు, దర్శి నియోజకవర్గాల అభ్యర్థులు ముందున్నారు. ఒక్కోచోట రూ.150 కోట్లకు పైగానే వెచ్చించారు. అద్దంకి, పర్చూరు, చీరాల, కందుకూరు నియోజవర్గాల్లో ఒక్కో చోట రూ. 100 కోట్ల వరకూ ఖర్చుచేసినట్లు అంచనా.
సార్వత్రిక ఎన్నికలలో గతంలో ఎన్నడూలేని విఽధంగా మార్కాపురం పట్టణంలో ఓటింగ్ శాతం పెరిగింది.
సకల జీవకోటికి ప్రకృతి వరప్రసాదంగా ఇచ్చిన పర్యావరణాన్ని పరిరక్షిం చుకుందామని ట్రైనీ ఐఫ్ఎస్ శివశంకర్ హంగళ్ అన్నారు.
ష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం గెలుపోటములపై బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. సింగరాయకొండ మండలంలో టీడీపీకి ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు, వైసీపీకి మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సు రేష్ టంగుటూరు మండలంలోని పలువురు వైసీ పీ నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముగిసిన తరువాత సింగరాయకొండ క్యాంపు ఆఫీ్సలో ఉన్న మంత్రి సురే్షను కలిసేందుకు వెళ్లారు. ఎన్నికలలో ఖర్చుపెట్టిన డబ్బు విషయం మాట్లాడడంతో మంత్రి కస్సుమన్నారు.