Share News

వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ వైన్‌షా్‌ప సూపర్‌వైజర్‌

ABN , Publish Date - May 04 , 2024 | 10:54 PM

ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఉద్యోగులే కాదు.. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న ఎవరైనా దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను మండలంలోని పలువురు బేఖాతర్‌ చేస్తున్నారు.

వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ వైన్‌షా్‌ప సూపర్‌వైజర్‌
వైసీపీఎన్నికల ప్రచారర్యాలీలో ప్రభుత్వ వైన్‌షా్‌పసూపర్‌ వైజర్‌ మందా శ్యామేల్‌

తాళ్లూరు, మే 4 : ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఉద్యోగులే కాదు.. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న ఎవరైనా దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను మండలంలోని పలువురు బేఖాతర్‌ చేస్తున్నారు. బొద్దికూరపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి దర్శి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఆ గ్రామానికి చెందిన ప్రభుత్వ వైన్‌షా్‌ప సూపర్‌వైజర్‌ మందా శ్యామేల్‌ ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Updated Date - May 04 , 2024 | 10:54 PM