Share News

బాలినేని చెప్పేవన్నీ అబద్ధాలు..చేసేవి అక్రమాలు !

ABN , Publish Date - May 05 , 2024 | 12:33 AM

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పేవి అన్నీ అ బద్ధాలని, ఆయన చేసేవన్నీ అక్రమాలే అని టీ డీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఒంగోలులోని టీడీపీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన బాలినేనిపై విమర్శలు చేశారు.

బాలినేని చెప్పేవన్నీ అబద్ధాలు..చేసేవి అక్రమాలు !

పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజం

ఒంగోలు(కార్పొరేషన్‌), మే 4: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పేవి అన్నీ అ బద్ధాలని, ఆయన చేసేవన్నీ అక్రమాలే అని టీ డీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఒంగోలులోని టీడీపీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన బాలినేనిపై విమర్శలు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అయినా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. అక్రమాలు, భూ కబ్జాలు, దందాలు, వసూళ్లు చేసిన నేత ప్రజలను పట్టాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అయినా పట్టించుకోని పట్టాల పంపిణీ, ఎన్నికల వచ్చాక గుర్తు వ చ్చాయా అని ధ్వజమెత్తారు. 25వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మీడియా సాక్షిగా చెప్పిన బాలినేని పట్టాలు ఇవ్వ లేకపోయారన్నారు. మరి రాజకీయ సన్యాసం ఎం దుకు చేయలేదని ప్రశ్నించారు. తనకు పదవి లేద ని తెలిసి కూడా అలిగి వెళ్ళిన ఆయన ఇప్పుడు పేదల కోసం పదవిని వదులుకోవడానికి సిద్ధమని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఎద్దు శశికాంత్‌ భూష ణ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ది ష్టిబొమ్మ దహనం చేసిన నేత, ప్రజలకు మేలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇళ్ళ పట్టాలు అంతా డ్రామా అని, ఇలాంటి బాలినేని శాశ్వతంగా రాజ కీయాలకు దూరం అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పట్టాల పంపిణీ పేరుతో నానా హడావుడి చేసిన ఆయన పట్టాలపై ఏమి మా ట్లాడకపోవడం దారుణమన్నారు. బాలినేని నాట కాలు, మోసాలు, అబద్ధాలు ప్రజల నమ్మవద్దని ఆయన కోరారు.

Updated Date - May 05 , 2024 | 12:33 AM