Share News

టీడీపీతోనే మహిళా సంక్షేమం: అఖిలప్రియ

ABN , Publish Date - May 04 , 2024 | 11:45 PM

రాష్ట్రంలోని మహిళల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు.

టీడీపీతోనే మహిళా సంక్షేమం: అఖిలప్రియ

శిరివెళ్ల, మే 4: రాష్ట్రంలోని మహిళల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. శిరివెళ్లలోని 103, 104, 105 బూత్‌ల పరిధి లోని ఖాదరబాదర గ్రామంలో శనివారం మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అఖిలప్రియ మాట్లాడుతూ పొదుపు సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఘనత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకే దక్కుతుం దన్నారు. ఖాదరబాదర గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఖాజా హుసేన్‌, మహమ్మద్‌ హుసేన్‌, నాలి వలి, గని ఫిదా, వసీం, ఫిదా హుసేన్‌, గుర్రప్ప, సూరా రామ, బ్రహ్మయ్య, వెంకట చెన్నుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

రుద్రవరం: ప్రజల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో ఉందుకు?, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆళ ్లగడ్డ టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. శనివా రం రుద్రవరం మండలం ఆర్‌.కొత్తపల్లె గ్రామాన్ని సందిర్శంచారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

టీడీపీలో చేరిక: మండలంలోని ఆర్‌.కొత్తపల్లె గ్రామంలో గంధం పెద్దరాశిరెడ్డి, గంధం జనార్దనరెడ్డి వారి అనుచరవర్గం 50 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 04 , 2024 | 11:45 PM