తిమ్మగురుడు రథోత్సవం
ABN , Publish Date - May 04 , 2024 | 11:17 PM
గూడూరు తిమ్మగురుడు రథోత్సవం శనివారం కోలాహలంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గూడూరు జనసంద్రంగా కనిపించింది.
గూడూరు, మే 4: గూడూరు తిమ్మగురుడు రథోత్సవం శనివారం కోలాహలంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గూడూరు జనసంద్రంగా కనిపించింది. తిమ్మగురుడు స్వామి ఆలయంలో స్వామి వారికి పవిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రథోత్సవానికి పూజలు చేశారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.