‘వాల్మీకులకు అండగా టీడీపీ’
ABN , Publish Date - May 04 , 2024 | 11:40 PM
వాల్మీకుల హక్కుల కోసం కృషిచేస్తామని, టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్ధి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల (నూనెపల్లె), మే 4: వాల్మీకుల హక్కుల కోసం కృషి చేస్తామని, టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్ధి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గోవిందనాయుడు అధ్యక్షతన శనివారం నంద్యాలలో వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బైరెడ్డి శబరి, ఫరూక్తో పాటు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎపి రాష్ట్ర విత్తనాబివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి, వాల్మీకి సామాజిక వర్గ రాష్ట్ర , జిల్లా నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వైసీపీ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక బాధలు పడ్డారని అన్నారు. రాష్ట్రానికి జగన్ ఏమి చేశారని మళ్లీ ఓటు వేయాలని ప్రశ్నించారు, వాల్మీకుల సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.