Share News

నేడు నీట్‌ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - May 04 , 2024 | 11:21 PM

వైద్య, విద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షకు సర్వం ఏర్పాట్లు సిద్ధం చేశారు.

నేడు నీట్‌ ప్రవేశ పరీక్ష

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 4: వైద్య, విద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షకు సర్వం ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఆదివారం నీట్‌ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేటప్పుడు అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు రెండు ఫొటోలు, వికలాంగుల అభ్యర్థులైతే ఫిజికల్‌ హ్యాండ్‌ సర్టిఫికెట్‌ ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా తీసుకువెళ్లాలి. కర్నూలు నగరంలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated Date - May 04 , 2024 | 11:21 PM