వైద్య రంగ సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - May 04 , 2024 | 11:42 PM
టీడీపీ అధికారంలోకి రాగనే వైద్య రంగంలో ఆసుపత్రుల యాజమాన్యం, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల (నూనెపల్లె), మే 4: టీడీపీ అధికారంలోకి రాగనే వైద్య రంగంలో ఆసుపత్రుల యాజమాన్యం, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో వైద్యుల ఆత్మీయ సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. శబరి, ఫరూక్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలో వైద్యులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి డాక్టర్ రవిక్రిష్ణ, డాక్టర్ మధుసూదన్రెడ్డి వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగనే నారా చంద్రబాబుతో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని శబరి, ఫరూక్ హామీ ఇచ్చారు. ఈ సమేవేశానికి వైద్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర దూదేకుల పెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫరోజ్, డాక్టర్ ఎన్ఎండి ఖలీల్, డాక్టర్ సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.