ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
ABN , Publish Date - May 04 , 2024 | 11:29 PM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాధారణ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు మంజురాజపాల్ అన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
సాధారణ ఎన్నికల
జిల్లా పరిశీలకురాలు మంజురాజపాల్
వన్టౌన్, మే 4: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాధారణ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు మంజురాజపాల్ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సును శనివారం ఆ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంజురాజపాల్ మాట్లాడుతూ కొత్తగా ఓటర్లుగా చేరిన విద్యార్థులు ఓటు వేయడాన్ని బాధ్యతగా గుర్తించాలన్నారు. ఎన్నికల రోజును పండుగగా జరుపుకోవాలన్నారు. విద్యార్థులు తమతో పాటుగా చుట్టు ఉన్న సమాజాన్ని సైతం ఓటు విషయంలో జాగృతం చేయాలని సూచించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు అధ్యక్షత వహించగా పశ్చిమ రిటర్నింగ్ ఆఫీసర్ కిరణమ్మయి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమశేఖరరెడ్డి, స్వీప్ నోడల్ ఆఫీసర్ యు.శ్రీనివాసరావు, జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రబోసు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్. సాంబశివరావు, డి.పవన్కుమార్, కల్మబేగం, శాంతిబాబు పాల్గొన్నారు.