ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.
ABN , Publish Date - May 04 , 2024 | 12:16 AM
ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు మదనపలి సీఐ శేఖర్ తెలిపారు.
మదనపల్లి అర్బన మే 3 : ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు మదనపలి సీఐ శేఖర్ తెలిపారు. మదనపలి మండలం వేంపల్లి పంచా యతీ కస్పాకు చెందిన బయన్న గారి సతీష్(49) శుక్ర వారం ఉదయం ఇంట్లో తాడుతో ఉరివేసుకొని ఆత్మహ త్య చేసుకున్నాడని తెలిపారు . ఇతను బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నారని, ఐతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటూ ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 1న బెంగళూరు నుంచి మదనపలి మండలం వేంపల్లికి వచ్చి, ఆర్థిక ఇబ్బందుల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. తండ్రి వ్యవసాయదారి కావడంతో కుటుంబ సభ్యులకు ఇబ్బందులు, సమస్యలు తీర్చలేమని తేల్చి చెప్పడంతో శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయం చూసి ఇం ట్లో తాడుతో పైపుకు ఉరేసుకున్నారు. విషయం తెలుసు కున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అప్పటికే అతను మృతి చెందడంతో మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపలి రూరల్ సీఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు పేర్కొన్నారు .