Share News

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

ABN , Publish Date - May 04 , 2024 | 11:17 PM

ఎనడీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రాపెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన పిలుపు నిచ్చారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన

ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన

మదనపల్లె అర్బన, మే 4: ఎనడీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రాపెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక ఓ ప్రైవేట్‌ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ప్రజాస్వా మిక పాలన కోసం ఎనడీఏ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ఐదేళ్లు అరాచకపాలన ఏపీ రాష్ట్రంలో జగన పాలన చూశామన్నారు. దోపిడీ, అక్రమాల, దౌర్జన్య, మాఫియా పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందు లు పడ్డామన్నారు. ఉద్యోగులకు, రైతులకు, మహిళలకు, యువతకు, నిరుద్యోగులను సంక్షేమం ఇచ్చేది ఎనడీఏ కూటమితో వచ్చే ప్రభుత్వమే అన్నారు. జగన ఏపీని అప్పుల ఆంధ్రాగా చేశారని ఆరోపించారు. పెన్ష నర్లకు రావాల్సిన సొమ్మును ఇతర అవసరాలకు దారి మళ్లించి పెన్షన ర్స్‌ను ఇంబ్బందులకు గురి చేశారని తెలిపారు. ప్రతి నెలా పెన్షన సకా లంతో అందక జగన పాలనలో అవస్ధలు పడ్డామన్నారు. దుర్మార్గ పాల కుడైన జగనను ఇంటికి పంపేప్రయత్నం అందరూ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దన్నగౌడ్‌, రాష్ట్రకోశాధికారి టి.నాగభూషణరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ పీఎస్‌ఎన మూర్తి, మదనపల్లె నాయకులు మణికంఠనారాయణ, ఆర్‌ శ్రీనివాసులు. మర్రిపాటిరెడ్డెప్ప, తిమ్మయ్య, జగనమోహన, గురునారాయణాచారి, శ్రీరాములు, ప్రజాకవి రెడ్డెప్ప, నరసింహామూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:17 PM