ఓటుతో రౌడీయిజాన్ని తరిమికొట్టండి
ABN , Publish Date - May 04 , 2024 | 11:19 PM
పీలేరు నియోజక వర్గంలో ప్రజలంతా తమ ఓటుతో ప్రస్తుతం కొన సాగుతున్న రౌడీయిజాన్ని తరిమికొట్టాలని మాజీ సీఎం, రాజం పేట కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
వాల్మీకిపురం/గుర్రంకొండ, మే 4: పీలేరు నియోజక వర్గంలో ప్రజలంతా తమ ఓటుతో ప్రస్తుతం కొన సాగుతున్న రౌడీయిజాన్ని తరిమికొట్టాలని మాజీ సీఎం, రాజం పేట కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి గ్రామం ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఎనడీఏ కూటమి పార్టీ ల కార్యకర్తల సమావేశంలో నల్లారి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో పుంగనూరు నుంచి వచ్చి పీలేరు నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్న పెద్దిరెడ్డికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు. అభివృద్ధి అంటే ఏంటో తనకు పూర్తిగా తెలుసని రాజంపేట ఎంపీగా తనకు కమలం గుర్తుపై పీలేరు ఎమ్మెల్యేగా తన సోదరుడు నల్లారి కిశోర్కుమార్రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు అండదండగా ఉంటామన్నారు. కార్యక్ర మాలలో పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, జనసేన పీలేరు ఇనఛార్జి బెజవాడ దినేష్, టీడీపీ, జనసేన మండల పార్టీల అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, మహేష్, మాజీ ఎంపీపీలు సురేంద్రవర్మ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. కాగా గుర్రంకొండలో శనివారం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8న కలికిరిలో జరిగే ప్రధానమంత్రి మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దినేష్, జగదీష్, నౌషాద్ అహ్మద్, ప్రసాద్నాయుడు, మహాత్మా రెడ్డి, హరిప్రసాద్నాయుడు, మేకల చలపతి పాల్గొన్నారు.