డీఎంఈ బృందం పర్యటనలోగా అన్నీ పూర్తి చేయాలి
ABN , Publish Date - May 04 , 2024 | 11:21 PM
మదనపల్లె ప్రభుత్వాస్పత్రిని అప్గ్రేడ్ చేస్తూ జనరల్ ఆస్పత్రిగా మార్చడానికి, మెడి కల్ కాలేజీ అనుమతికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యు కేషన(డీఎంఈ) బృందం పర్యటనలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు సూచించారు.
మదనపల్లె టౌన, మే 4: మదనపల్లె ప్రభుత్వాస్పత్రిని అప్గ్రేడ్ చేస్తూ జనరల్ ఆస్పత్రిగా మార్చడానికి, మెడి కల్ కాలేజీ అనుమతికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యు కేషన(డీఎంఈ) బృందం పర్యటనలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు సూచించారు. శనివారం ప్రభుత్వాస్పత్రిలో పలు విభాగాలను, ల్యాబ్లను ఆయన పరిశీలించి మా ట్లాడుతూ ప్రస్తుతం ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో అదనపు పడకల గదుల నిర్మాణం, మెట్ల నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో పాము కలకలం రేపిందని, ఆస్పత్రి ఆవరణంలో ముళ్లపొదలు, రాళ్లుకుప్పలు తొలగించాలని ఏపీఎంఎస్ఐడీసీ శాఖ అధికారులను కోరారు. కార్యక్ర మంలో డాక్టర్ మురళిధర్, వైద్యులు పాల్గొన్నారు.