టెన్త్ ఫెయిలయ్యావని తిడుతున్నారని బాలిక ఆత్మహత్య
ABN , Publish Date - May 05 , 2024 | 12:02 AM
పదో తరగతి ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ప్రతి రోజు చీవాట్లు పెట్టడాన్ని జీర్ణించుకోలేని పసి హృదయం ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లజర్ల మండలం పుల్లలపాడులో జరిగింది.
నల్లజర్ల, మే 4: పదో తరగతి ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ప్రతి రోజు చీవాట్లు పెట్టడాన్ని జీర్ణించుకోలేని పసి హృదయం ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లజర్ల మండలం పుల్లలపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లలపాడుకుచెందిన దాసరి దుర్గారావు, నిర్మల దంపతుల కుమార్తె వనలక్ష్మి(15) శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వనలక్ష్మి ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యింది. ఇతరుల పిల్లలను పోల్చి తరచూ తల్లిదండ్రులు చీవాట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో శనివారం ఉదయం వనలక్ష్మిని తల్లి మరోమారు మందలించింది. దీంతో మనస్థాపం చెంది తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన తరువాత మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి పోసుకుని మృతి చెందింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఫ్యాన్కు వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.