Home » Andhra Pradesh » East Godavari
రత్నగిరివాసుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడే వేళ సమీపిస్తోంది. ప్రతిఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యదేవుడి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరు గుతుండగా క్రోధి నామసంవత్సర కల్యాణోత్సవ వేడుకలు ఈసారి మే 18న ప్రారంభమై 24తో ముగియనున్నాయి.
ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది చారిత్రాత్మక రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన. దీన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్య నిర్ణ యాలతో సర్వనాశనం చేశారు. మరమ్మతుల పేరిట కొన్నిసార్లు, ప్రతి పక్ష పార్టీల యాత్రలను వంతెన మీదుగా వెళ్లకుండా చేయడానికి మరమ్మతులంటూ మరికొన్నిసార్లు పెద్ద తతంగమే నడిపారు. అంతం కాదిది ఆరంభం అన్న చందంగా బాగుచేసే పనులు అనేక సార్లు సాగించారు.
అపరిష్కృత సమస్యల సాధన కోసం ఉపాధ్యాయులే ప్రభుత్వం కళ్లు తెరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గైట్ కళాశాలలో రెండ్రోజులపాటు జరిగే రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర స్థాయి ఉద్యమ శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవ చ్చని ప్రకృతి వ్యవసాయ శాఖ మేనేజర్ తాతారావు అన్నారు. నియోజకవర్గం లోని దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల ప్రకృతి వ్యవసాయ సిబ్బం దితో శుక్రవారం దేవరపల్లిలోని రైతు భరోసా కేంద్రం వద్ద సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ముందు గాలి దుమారంతో అరటి తోటలు విరిగిపడ్డాయి. నాయకులందరూ ఎవరి హడావిడిలో వారున్నారు. ఒక్కరు కూడా రైతులను పలకరించిన పాపాన పోలేదు. అధికారులు కూడా అం తంత మాత్రంగానే పర్యటించి నష్టం వివరాలు నమోదుచేశారు.
జిల్లాలో పల్లెలు పోటెత్తాయి. ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఉద్యమమై కదిలాయి. సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు వెల్లువ లా గ్రామీణ ప్రాంతాలు తరలివచ్చాయి. ఓటుహక్కు బాధ్యతను విస్మ రించకుండా బూత్లవద్ద ఓటర్లు బారులు తీరాయి. కనివినీ ఎరుగని రీతిలో ఒక్కటిగా కదిలి పోలింగ్శాతం అమాంతం పెంచేశాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు తేలిక పాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాఽథ్ తెలి పారు.
ఏంటో ఈ అధికారుల లీలా వినోదం.. జిల్లా కేంద్రంలో అధికారుల కళ్లెదుటే ఇసుక తవ్వేస్తున్నా ఎటు వంటి దాడులూ లేవు..ఇప్పుడేమో హడావుడి చేస్తున్నారు. కళ్లె దుట రాజమహేంద్రవరంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నా కనిపించడంలేదు.. తీపర్రులో మాత్రం అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా హడావుడి చేస్తు న్నారు.
అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యు త్ తీగ ఒక మహిళ ప్రాణాలను బలగొంది.
అంతా నేనే.. కర్త కర్మ క్రియ అంతా నేనే.. ఇదీ జగన్ నియంతృత్వ ధోరణి.. ఓటు కూడా అభ్యర్థిని చూసి వేయరు.. నన్ను చూసి వేయాలి.. ఇదీ జగన్ మాట.. ఆ నియంతృత్వమే కొంప ముంచినట్టు సమాచారం..