మెగా డీఎస్సీపైనే తొలి సంతకం
ABN , Publish Date - May 05 , 2024 | 12:18 AM
కోటనందూరు, ఏప్రిల్ 4: టీడీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం ఉంటుందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. శనివారంరాత్రి మండలంలోని కెవోఅగ్రహరం, పాతకొట్టాం, కెకొట్టాం, ఎల్డిపేట, అల్లిపూడి గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ర్పాటు ఖాయమని, వెంటనే ఇచ్చిన హమీలు అమలు చేస్తామ
కోటనందూరు, ఏప్రిల్ 4: టీడీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం ఉంటుందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. శనివారంరాత్రి మండలంలోని కెవోఅగ్రహరం, పాతకొట్టాం, కెకొట్టాం, ఎల్డిపేట, అల్లిపూడి గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ర్పాటు ఖాయమని, వెంటనే ఇచ్చిన హమీలు అమలు చేస్తామని తెలిపారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారీటీలకు పూర్తి అండ గా ఉంటామని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరా రు. కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, పెంటకోటబాస్కరసత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్, షేక్నవాబ్జానీ, డి చిర ంజీవిరాజు, అంకంరెడ్డి బుల్లిబాబు, చిటికెల సత్యనారాయణ, పెనుముచ్చునాగేశ్వరరావు, పోతల సూరిబాబు, గాది రాము, మాతిరెడ్డిబాబులు, శ్రీరామమూర్తి, జనసేన నేతలు పెదపాత్రుని శ్రీనివాస్, పెనుముచ్చు ప్రవీణ్, అకెళ్లశాస్త్రీ ఉన్నారు.