Share News

ఫోన్‌లో స్టేటస్‌ చూసి జనసేన కార్యకర్తను కొట్టిన వైసీపీ కార్యకర్త

ABN , Publish Date - May 05 , 2024 | 12:42 AM

ఎన్నికల వేళ వైసీపీ నాయకుల అకృత్యాలు పెరుగుతు న్నాయి. ఇనుగంటివారిపేటలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఒక వైసీపీ కార్యకర్త జనసేన కార్యకర్తపై దాడికి తెగ బడ్డాడు. రాజానగరం మండలం ఎర్రవరం గ్రామంలో శుక్రవారం రాత్రి రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా రోడ్‌ షో చేస్తున్న సందర్భంగా జనసేన కార్యకర్తలు జనసేన జెండాలతో పవన్‌ కల్యాణ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

ఫోన్‌లో స్టేటస్‌ చూసి   జనసేన కార్యకర్తను కొట్టిన వైసీపీ కార్యకర్త

ఫోన్‌లో స్టేటస్‌ చూసి

జనసేన కార్యకర్తను కొట్టిన వైసీపీ కార్యకర్త

సీతానగరంలో కేసు నమోదు

సీతానగరం, మే4: ఎన్నికల వేళ వైసీపీ నాయకుల అకృత్యాలు పెరుగుతు న్నాయి. ఇనుగంటివారిపేటలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఒక వైసీపీ కార్యకర్త జనసేన కార్యకర్తపై దాడికి తెగ బడ్డాడు. రాజానగరం మండలం ఎర్రవరం గ్రామంలో శుక్రవారం రాత్రి రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా రోడ్‌ షో చేస్తున్న సందర్భంగా జనసేన కార్యకర్తలు జనసేన జెండాలతో పవన్‌ కల్యాణ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు వాట్సప్‌లలో చక్కర్లుకొడుతున్నాయి.ఇదిలా ఉండగా ఆ దృశ్యాలను సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందిన జనసేన కార్యకర్త వరదా తరుణ్‌ తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. అది చూసిన అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కొండాటి దుర్గాప్రసాద్‌ శనివారం ఉదయం ఫోన్‌ చేసి పచ్బిబూతులు తిడుతూ చంపుతానని బెదిరించి భయబ్రాంతులకు గురిచేశాడన్నాడు. అనంతరం వెం టనే ఇనుగంటివారిపేట రమ్మని చెప్పడంతో వెళ్లగా నన్ను పది మందిలో చెంపపై కొట్టి స్టేటస్‌ ఎందుకు పెట్టుకున్నావురా అంటూ బెదిరించాడన్నాడు. అక్కడ ఉన్నవారు అడ్డుపడినా ఆగకుండా బ్లేడ్‌ పట్టుకుని తిరుగుతూ చంపుతానని బెదిరిస్తున్నాడని.. తనకు రక్షణ కావాలంటూ సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీతానగరం ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు

Updated Date - May 05 , 2024 | 12:42 AM