Share News

ప్రయాణికులకు బస్సు కష్టాలు

ABN , Publish Date - May 05 , 2024 | 12:16 AM

పలమనేరులో శనివారం ముఖ్యమంత్రి జగన్‌ బస్సుయాత్ర కోసం పోలీసులు ఉదయం నుంచి వాహనాలను మళ్లించారు.

ప్రయాణికులకు బస్సు కష్టాలు
బస్సుల్లేక వెలవెలపోతున్న ఆర్టీసీ బస్టాండు

పలమనేరు, మే4 : పలమనేరులో శనివారం ముఖ్యమంత్రి జగన్‌ బస్సుయాత్ర కోసం పోలీసులు ఉదయం నుంచి వాహనాలను మళ్లించారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని క్లాక్‌టవర్‌ వద్ద ఎంబీటీ రోడ్డుపై సభ ఏర్పాటు చేయడంతో బస్టాండులోకి బస్సులు వెళ్లకుండా దారి మళ్లించారు. ఈ విషయం తెలియని ప్రయాణికులు బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇబ్బందిపడ్డారు. పైగా చిత్తూరు నుంచి పలమనేరుకు వచ్చే బస్సులు మార్కెట్‌ కమిటీ వద్ద ప్రయాణికులను దించి వెళ్లిపోయాయి. అక్కడి నుంచి మళ్లీ ఆటోల్లో వెళ్లాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం సభకు మద్యం ఫుల్‌

పలమనేరు సీఎం సభలో మద్యం ఏరులై పారింది. వైసీపీ కార్యకర్తలకు ఏమాత్రమూ కొదవ లేకుండా మద్యం సరఫరా చేశారు. ఫుల్‌గా మందు కొట్టిన కార్యకర్తలు జగన్‌ మాట్లాడుతున్నంత సేపూ చిందులేస్తుండడం కనిపించింది. మద్యంతోపాటు బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు.

Updated Date - May 05 , 2024 | 12:16 AM