Home » Andhra Pradesh » Chittoor
కొందరు దుర్మార్గులు తాము చేసిన పని ఎక్కడ బయటపడుతోందననే భయంతో ఓ గుడి పూజారిని కిడ్నాప్ చేశారు. ఆపై చిత్రహింసలకు గురి చేశారు. తాము పోలీసులమంటూ వచ్చి తీసుకెళ్లిన దుండగులు.. నరకం చూపించారు. ఎలాగోలా వారి చెర నుంచి పూజారి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించగా.. అసలు విషయం బయటపడింది. ఇంతకీ పూజారిని ఎవరు కిడ్నాప్ చేశారు?
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విలువైన డీకేటీ భూములను రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ వైసీపీ ముఖ్యనేత అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గవ్యాప్తంగా వందలాది ఎకరాల డీకేటీ భూములను కొద్ది నెలల క్రితం ప్రీ హోల్డ్ జాబితాలో పెట్టారు. డీకేటీ పట్టా పొంది 20 ఏళ్లు పూర్తయిన భూములను ప్రీ హోల్డ్గా గుర్తించారు
గూడూరు మార్కెట్లో శుక్రవారం నిమ్మకాయల ధరలు తగ్గిపోయాయి. నాలుగురోజుల క్రితం కిలో రూ.80 నుంచి రూ.130 వరకు పలికిన నిమ్మకాయలు శుక్రవారం రూ. 30 నుంచి రూ.90 మాత్రమే పలికాయి.
తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, లడ్డూప్రసాద కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్ ప్రాంతాల్లో ఈ రద్దీ అధికంగా కనిపిస్తోంది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, తర్వాత సంభవించిన హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం ఎన్నికల కమిషన్ నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ కె.రవిమనోహరాచారికి చోటు దక్కింది. ఎస్ఐగా, సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం ఈయన పనిచేశారు.
తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను శుక్రవారం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్కు మూడంచెల భద్రత, 144 సెక్షన్ అమలు తీరును పరిశీలించారు.
చంద్రగిరి మండలం ఆముదాలకోన ఎస్టీ కాలనీ పీతల చెరువు సమీపంలోని అటవీప్రాంతంలో ఒంటరి ఏనుగు జాడను శుక్రవారం అటవీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా పనపాకం డిప్యూటీ రేంజి అధికారి చినబాబు ఆధ్వర్యంలో ఏనుగు జాడ కోసం గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఏనుగు పాదముద్రలు, వ్యర్థాలు కనిపించాయి.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ర్టాంగ్ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాలలోని స్ర్టాంగ్ రూములను శుక్రవారం ఆయన పరిశీలించారు.
స్నేహితుడి ఇంటికి డిన్నర్ కోసం వచ్చి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు యువకులు మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నగరి మండల పరిధిలోని తడుకుపేట జగనన్న హౌసింగ్ కాలనీ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.