Share News

మృత్యువులోనూ వీడని బంధం

ABN , Publish Date - May 03 , 2024 | 02:36 AM

బస్సు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులూ మరణించిన సంఘటన గురువారం సాయంత్రం ఏర్పేడు మండలంలో చోటు చేసుకుంది.

మృత్యువులోనూ వీడని బంధం
బస్సు ఢీకొనడంతో నుజ్జునుజ్జైన కారు - డ్రైవర్‌ మురుగన్‌ మృతదేహం - దంపతులు అంజు- లలిత్‌ సింఘాల్‌(ఫైల్‌ఫొటోలు)

ఏర్పేడు, మే 2: బస్సు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులూ మరణించిన సంఘటన గురువారం సాయంత్రం ఏర్పేడు మండలంలో చోటు చేసుకుంది.సీఐ శ్రీరామ శ్రీనివాసులు కథనం మేరకు... ముంబాయికి చెందిన మెక్టోడియస్‌ ఫార్మాస్యుటికల్‌ కంపెనీలో చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న లలిత్‌ సింఘాల్‌(57), తన భార్య మంజు(52)తో కలిసి తిరుమల వెంకన్న దర్శనార్థం విమానంలో బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. అక్కడినుంచి ట్యాక్సీలో తిరుపతి వెంకన్న దర్శనానికి బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం తరువాత శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యమైన ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ఉన్న పద్మావతి హోటల్‌ సమీపంలో జాతీయ రహదారిపై తిరుపతి వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ ఏసీ బస్సు వీరి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ మురుగన్‌(28) అక్కడికక్కడే మృతి చెందగా లలిత్‌ సింఘాల్‌, మంజు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఏర్పేడు పోలీసులు వీరిని తిరుపతి శివార్లలోని నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ తుదిశ్వాస విడిచారు.వారి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ముగ్గురి మతృదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - May 03 , 2024 | 02:36 AM