కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - May 04 , 2024 | 11:33 PM
రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేనా, బీజేపీ కూటమి వల్లే సాధ్యమని అనంతపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ పేర్కొన్నారు.
గార్లదిన్నె, మే 4 : రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేనా, బీజేపీ కూటమి వల్లే సాధ్యమని అనంతపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. శనివారం శింగనమలలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో వారికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం ఫలికారు. శింగనమల ఆత్మరామ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా దర్గాను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేవలం కూటమి విజయంతోనే సాధ్యమని, చంద్రబాబు నాయుడు సీఎం కావడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ నేతలు దోచుకోవడం... దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డి తన బంధువులను మండలానికి ఒకరిని పెట్టుకుని సర్వం దోచుకున్నారన్నారు. ఇలాంటి వారికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అనంతరం నార్పలలో ముఖ్య నేతలతో కలసి మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.
మరిన్ని వార్తల కోసం...