EO : లేపాక్షి శిల్పకళ అద్భుతం
ABN , Publish Date - May 04 , 2024 | 11:44 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గా వీరభద్రస్వామి ఆలయంలోని శిల్ప, చిత్రకళలు అద్భుతం గా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మనీష్సింగ్ ఐఏఎస్, అజయ్నాథ్ఝా ఐఏఎస్, రవికుమార్ ఐపీఎస్ అన్నారు. వారు శనివారం దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహశర్మ స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు.
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మనీష్సింగ్
లేపాక్షి, మే 4: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గా వీరభద్రస్వామి ఆలయంలోని శిల్ప, చిత్రకళలు అద్భుతం గా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మనీష్సింగ్ ఐఏఎస్, అజయ్నాథ్ఝా ఐఏఎస్, రవికుమార్ ఐపీఎస్ అన్నారు. వారు శనివారం దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహశర్మ స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. ఏడు శిరస్సుల నాగేంద్రుడు, అర్ధంతరంగా ఆగిన కల్యాణమండపం, సీతాదేవిపాదం, వేలాడే స్తంభాన్ని సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని కొనియాడారు. అనంతరం దుర్గా, వీరభద్రస్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ సిబ్బంది అధికారులను దుశ్శాలువలతో సత్కరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....