Home » 2024
వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం దక్షిణాది హనుమద్ జయంత్యుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రవచనాలు, హనుమాన చాలీసా పఠనాలను నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కసాపురం ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ...
అన్నదాతల ఆశల సీజన ఖరీఫ్ వచ్చేసింది. ప్రతి ఏడాది జూన్ 1 నుంచి సీజన్ ప్రారంభమై సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. ఖరీ్ఫలో జిల్లాలోని మెట్ట భూముల్లో వర్షాధారం కింద ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీ్ఫలో జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 1.97 లక్షల హెక్టార్లు, కంది 37వేలు, పత్తి 48వేలు, ఆముదం 16వేలు, వరి 18వేల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, ఉలవలు,పెసలు, అలసంద తదితర రకాలు అంతర పంటలు ...
మండలంలోని పాలసముద్రం పంచాయతీ రాగిమేకలపల్లి వద్ద ఉన్న గ్రామ కఠం ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అడంగల్ ప్రకారం సర్వేనెంబర్ 21-1లోని 10.80 ఎకరాల్లో రాగిమేకలపల్లి గ్రామం, శ్మశానవాటిక పోను మిలిన రెండున్నర ఎకరాలు గ్రామ కఠం స్థలంలో గుట్ట ఉంది. పాలసముద్రం వద్ద పరిశ్రమల రాకతో ఈప్రాంతంలో భూముల ధరలు పెరిగాయి. దీంతో హిందూపురం ప్రధాన రహదారికి అనుబంధంగా ఉన్న గ్రామీణ రోడ్డు పక్కన ఉన్న స్థలం కావడంతో కొంతమంది కన్నుపడింది. ఆ స్థలానికి తమకు పట్టా ఇచ్చారంటూ ఇటీవల కాటేపల్లికి చెందిన ఇద్దరు గ్రామస్థాయి నాయకులు ఆ గ్రామ కంఠం స్థలాన్ని చదును చేసి, ఆక్రమించుకునే ప్రయ త్నం చేశారు.
ఆస్పత్రికి వస్తే ఉన్న రోగం పోవాలి కానీ అనంతపురం పెద్దాస్పత్రికి వస్తే మాత్రం కొత్త రోగాలు తగులుకుంటున్నాయి. ఆస్పత్రిలోని ఆపరేషన థియేటర్లలో పరిశుభ్రత పాటించకపోవడమే కొత్త రోగాల వ్యాప్తికి కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనల్లో ఆస్పత్రి పాలనాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గత ఏడాది జూలైలో ఇదే ఆస్పత్రిలో పలువురికి కంటికి శస్త్ర చికిత్సలు చేసి ఇంటికి పంపారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత ఐదుగురు వృద్ధులకు కళ్లు వాపులు రావడం, ఎర్రగా మారడం, మంటలు, ...
సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున ్న విత్తన పంపిణీని జిల్లా వ్యవసాయాధి కారి వైవీ సుబ్బారావు శనివారం తనిఖీ చేశారు. మండలం లోని మల్లాపల్లి ఆర్బీకేలో విత్తన పం పిణీ కార్యక్రమాన్ని పరిశీలించి, విత్తన నాణ్యత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మండలా నికి 4,289క్వింటాళ్లు రావలసిన ఉండగా, ఇప్పటి వరకు 3,679.8 క్వింటాళ్లు కె -6రకం సరఫరా అ యినట్లు ఏఓ మునికృష్ణ తెలిపా రు.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. యూనిఫాంలో రిటైరవ్వాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. హైకోర్టు చెప్పిందనో, ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనో తెలియదు గానీ.. ఆయన పదవీవిరమణ చేయాల్సిన శుక్రవారం నాడే జగన్ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
కౌంటింగ్ రోజు దగ్గరపడే కొద్దీ టెన్షన పెరుగుతోంది. ఫలితాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు, పార్టీలు, ఓటర్లది ఒక రకమైన టెన్షన కాగా.. కౌంటింగ్లో పాల్గొనే అధికారులది మరో రకం టెన్షన. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు హింసాత్మక మార్గాలను ఎంచుకోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. కౌంటింగ్ రోజున తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు...
శెట్టూరు మండలం ఐదుకల్లుకు చెందిన ముగ్గురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ఐసీడీఎస్ అధికారులు తీసుకున్నారు. గ్రామానికి చెందిన చంద్రకళ, తిమ్మరాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. తిమ్మరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చంద్రకళ ఇటీవల మరణించారు. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఇతర అధికారులు గురువారం గ్రామానికి వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న ప్రభాని(11), రెండో తరగతి ..
పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, ఉత్సవ నిత్యహోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అర్చకులు గుండూరావు, బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేయించారు. అనంతరం అర్చకులు ఒకరిపై ఒకరు వసంతాలను...
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ముడి ఇనుప గనుల లీజు ప్రాంతాల హద్దులను గుర్తించేందుకు కేంద్ర బృందం గురువారం సర్వే ప్రారంభించింది. మైనింగ్ జరుగుతున్న కొండల్లో వారంరోజుల పాటు సర్వే నిర్వహిస్తామని ఈ బృందం తెలిపింది. కర్ణాటకలోని టుముటి, విఠలాపురం సరిహద్దుల్లో ఏడు మైనింగ్ లీజులు ఉన్నాయి. వాటి లీజు కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో లీజ్ రెన్యువల్ చేసేందుకు ఎనఐటీకే సీనియర్ ప్రొఫెసర్ సూరత హర్షవర్ధన నేతృత్వంలోని బృందం సర్వే చేస్తోంది. ఏడు మైనింగ్ లీజులు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఆంధ్ర, కర్ణాటక అధికారులు ...