Home » Telangana » Karimnagar
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి జన్మదిన పురస్కరించుకొని బుధవారం ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకు న్నారు.
నేత్ర, అవయవదానాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అన్నారు.
సింగరేణి ట్రేడ్యూనియన్ టీబీజీకేఎస్ కమిటీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కార్మికులు, ప్రజలు గుర్తించాల ని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.
టీటీఎస్లోని గోదావరి భవన్ ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయానికి ఎన్టీపీసీ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని బీజేపీ నాయకురాలు కందు సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు.
చొప్పదండి మున్సిపాలిటీగా మారి ఐదేళ్లు గడిచాయి. పన్నులు పెరిగాయే తప్ప ఎటువంటి మౌలిక సదుపాయాలు సమకూరలేదు.
నకిలీ విత్తనాలు, కాలం చెల్లించిన విత్తనాలు, నిషేధిత పురుగు మందులు, నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి డీలర్లు, వ్యాపారులను హెచ్చరించారు. బుధవారం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లాలోని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విక్రయ డీలర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.
మండుతున్న ఎండలతో భూగర్భజలాలు అడుగంటి పోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. దీంతో అనేక కాలనీల్లో నగరవాసులు నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దిగువ మానేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు పడిపోయి 5.5 టీఎంసీలకు చేరాయి. తాగునీటికి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి భారీగా నగదు, మద్యం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మార్చి 16 నుంచి తనిఖీల్లో సరైన ఆధారాలు చూపించని వ్యక్తుల వద్ద 8.96 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలను మంగళవారం భద్రపరిచారు.
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సరళని బట్టి చూస్తే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ గెలు పు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నా రు.