Home » Andhra Pradesh » Vizianagaram
జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను డెంకాడ మండలం జొన్నాడ సమీపంలో ఉన్న లెండి ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లకు తీసుకొచ్చారు.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను అధికారులు తెరవడంపై వివాదం చెలరేగింది.
మండలంలోని జి.ములగాంలో బుధవారం రాత్రి నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి ఓటు విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సర్వర్ డౌన్ సమస్య నిత్యం వేధిస్తోంది. ఎప్పుడు పనిచేస్తుందో? ఎప్పుడు ఆగిపోతుందో? తెలియని పరిస్థితి నెలకొంటుంది.
ఎన్నికలు ముగిశాయని నిర్లక్ష్యం వద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీ ఐజీ విశాల్ గున్నీ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది ఆది నుంచీ కష్టాలు పడ్డారు. మూడు రోజుల పాటు ఆపసోపాలు పడ్డారు. ఈవీఎంలు అప్పగించే వరకు నానా అవస్థలు పడ్డారు.
కొమరాడ మండలంలో కొద్దిరోజులుగా సంచరించిన గజరాజులు ఇప్పుడు గరుగుబిల్లి మండలానికి చేరాయి. బుధవారం రాత్రి అవి గిజబలో హల్చల్ చేశాయి. గురువారం ఉదయం ఆ గ్రామ ప్రధాన రహదారిపై అరగంటపాటు సంచరించాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే జంపరకోట జలాశయ పనులను పూర్తి చేసి.. రైతులను ఆదుకుంటానని 2019 ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్ల పాలనా కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఎకరా భూమికి కూడా నీరందించ లేదు.
అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్లను గురువారం స్ర్టాంగ్ రూమ్లో భద్రపరిచారు.
ఏవోబీ వివాదాస్పద ప్రాంతం.. కొఠియా గ్రూపు ఓటర్లు ఇటు ఏపీలోను, అటు ఒడిశాలోను ఓట్లు వేశారు. ఇరు రాష్ర్టాలకు ఒకే రోజు పోలింగ్ జరిగినా ఇరుచోట్లా కొఠియా వాసులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.