Share News

YSRCP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వారికి వైసీపీ నేతల డబ్బు ఎర.. అదేంటని ప్రశ్నిస్తే..

ABN , Publish Date - May 06 , 2024 | 09:16 AM

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రౌడీల దాష్టీకం వెలుగు చూసింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు వేసే వారికి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు డబ్బు ఎర చూపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటూ ఓ యువకుడు ప్రశ్నించగా.. అతనిపై వెల్లంపల్లి అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి కొటారు. పాయకాపురం 63వ డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

YSRCP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వారికి వైసీపీ నేతల డబ్బు ఎర.. అదేంటని ప్రశ్నిస్తే..

విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రౌడీల దాష్టీకం వెలుగు చూసింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు వేసే వారికి వైసీపీ (YSRCP) అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు డబ్బు ఎర చూపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటూ ఓ యువకుడు ప్రశ్నించగా.. అతనిపై వెల్లంపల్లి అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి కొటారు. పాయకాపురం 63వ డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్లంపల్లి అనుయాయులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నున్న రూరల్ పోలీసు స్టేషన్‌లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన మనోహర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 06 , 2024 | 10:17 AM