ధోనీని భయపెట్టిన ఆటోడ్రైవర్ కొడుకు.. టాలెంట్ అంటే ఇది

ప్రతిభ ఉన్న ప్లేయర్లకు సరైన చాన్స్ వస్తే వాళ్లు గొప్ప విజయాలు సాధిస్తారనే దానికి ఈ సీఎస్‌కే-ఎంఐ మ్యాచ్ ఉదాహరణగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఎంఐ స్పిన్నర్ విఘ్నేష్ పుతుర్ (3/32) అనే చెలరేగి బౌలింగ్ చేశాడు.

ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, దీపక్ హుడాను ఔట్ చేశాడు విఘ్నేష్.

కేరళలోని ఓ ఆటోడ్రైవర్ కొడుకైన పుతుర్.. డెబ్యూ మ్యాచ్‌లోనే సీఎస్‌కే మీద 3 వికెట్లు పడగొట్టాడు. 

స్టేట్ లెవల్‌లో కూడా ప్రాతినిధ్యం వహించని ఈ స్పిన్నర్‌లోని ప్రతిభను గుర్తించి.. మెగా ఆక్షన్‌లో రూ.30 లక్షల మొత్తానికి అతడ్ని సొంతం చేసుకుంది ముంబై.

గతంలో పేస్ బౌలింగ్ వేసే పుతుర్.. షరీఫ్ అనే లోకల్ క్రికెటర్ సూచనతో స్పిన్‌కు మారాడు. అదే అతడి లైఫ్‌ను మలుపుతిప్పింది. 

ఐపీఎల్ ఆరంభానికి ముందు నెట్స్‌లో అదరగొట్టడంతో రోహిత్ స్థానంలో పుతుర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంది ఎంఐ.