ప్రముఖ నటి షావుకారు జానకి (94) శుక్రవారం (21-08-2026)  కన్నుమూశారు. 

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు.

1931, డిసెంబర్ 12న ఏపీలోని రాజమండ్రిలో ఆమె జన్మించారు.

1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో చిత్రసీమలో అడుగు పెట్టారు.

1950లో షావుకారు సినిమా హిట్ కావడంతో.. ఆ చిత్రం జానకి ఇంటి పేరుగా మారింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించారు. 

జానకికి ప్రముఖ నటి కృష్ణకుమారి స్వయానా సోదరి.

2022లో పద్మశ్రీ పురస్కారాన్ని షావుకారు జానకి అందుకున్నారు.