చార్ ధామ్ యాత్ర.. ఏ దేవుడ్ని  ముందుగా దర్శించుకోవాలి..

చార్ ధామ్ యాత్ర హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి

హిందువులు ఈ యాత్రలో నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు

పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు

అందుకే ముందుగా యమునోత్రి ఆలయం నుండి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది 

పూర్వ కాలంలో సాధువులు యమునా నదిలో స్నానం చేసి తమ దిన చర్యకు శ్రీకారం చుట్టేవారు

అందుకే మొదటగా యమునా నదిలో స్నానం చేసి యుమునోత్రి ఆలయాన్ని దర్శించి తమ యాత్రను మొదలుపెడతారు

ఉత్తరాఖండ్​ లోని నాలుగు పుణ్య క్షేత్రాలను ఈ యాత్రలో భక్తులు దర్శిస్తారు

ముందుగా యమునోత్రి తరువాత గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ లను దర్శిస్తారు