కైలాస మానసరోవర్ యాత్ర గురించి  ఈ విషయాలు తెలుసా..

ఐదేళ్ల విరామం తర్వాత, ఈ సంవత్సరం కైలాస మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది

జూన్ 30న ఈ యాత్ర ప్రారంభమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇటీవల ప్రకటించింది

ఈ యాత్ర నిర్వహణ బాధ్యతను కుమావున్ మండల్ వికాస్ నిగమ్ (KMVN)కు అప్పగించారు

ఈ యాత్ర చేపట్టే మొదటి బృందం జూలై 10న చైనాలోకి ప్రవేశిస్తుంది

చివరి యాత్రికుల బృందం  ఆగస్టు 22న భారతదేశానికి తిరిగి బయలుదేరుతుంది

కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందువులు, బౌద్ధులు, జైనులు, బోన్ మతాన్ని అనుసరించేవారు తీసుకునే పవిత్ర యాత్ర

ఈ యాత్రకు భక్తులు ప్రయాణంలో 15,000 అడుగుల ఎత్తు వరకు ఎక్కడం అవసరం

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా కైలాస మానసరోవర్ యాత్ర ఐదు  సంవత్సరాల క్రితం 2020లో ఆగిపోయింది

భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా యాత్ర పునఃప్రారంభం ఇంకా ఆలస్యం అయింది

కైలాష్ మానసరోవర్ యాత్ర ఢిల్లీలో ప్రారంభమయ్యే తీర్థయాత్ర

టిబెట్‌లోకి ప్రవేశించడానికి, యాత్రికులు పిథోరగఢ్ జిల్లాలో ఉన్న లిపులేఖ్ పాస్ గుండా ప్రయాణించాలి

దాదాపు 250 మంది యాత్రికులతో 22 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది

యాత్రికులను 50 మంది చొప్పున ఐదు బృందాలుగా విభజించారు