భారతదేశంలో చాలామంది
ఇష్టపడే వాటిలో బిర్యానీ ఒకటి.
బిర్యానీలో చాల రకాలు ఉన్నాయి. వాటిలో గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి.
ఈ బిర్యానీ కోసం ముందుగా గోంగూర ఆకులను ఉడికించి పేస్ట్ గా చేసుకొని పక్కన ఉంచండి.
స్టౌ మీద పాన్ పెట్టి.. తగినంత నూనె వేసి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వీయించి టొమాటో పేస్ట్ , గోంగూర ఆకులు వేసి తక్కువ మంటలో వేయించాలి.
బోన్ లెస్ చికెన్ పీసెస్ వేసి తక్కువ మంటతో కొంచెం సేపు ఉడికించాలి. కొంచెం కారం, పసుపు వేయండి.
కాస్త నీరు ఆడ్ చేసి పాన్ మీద మూత పెట్టండి. సుమారు 10-15 నిమిషాలు ఉడికించి మూత తెరిచి మసాలా పొడి వేసి బాగా కలపండి.
ముందుగా బాస్మతి రైస్ ను 80 శాతం వరకు ఉడికించి ముందుగా రెడీ చేసుకున్న గోంగూర చికెన్ మిశ్రమన్నీ అందులో వేసుకోవాలి.
తర్వాత నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తమీర , నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , జీడిపప్పు ,వేసి, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకొని మూత పెట్టండి.
చివరిగా తక్కువ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించండి. అంతే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ తినడానికి సిద్ధం.
Related Web Stories
సింహాన్ని కూడా భయపెట్టే జంతువులు ఇవే..
పురుష హార్మోన్ను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!
కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో డ్రింక్ ఎందుకు పూర్తిగా నింపరో తెలుసా?
నవరాత్రుల కోసం మేకప్ ఐడియాలు మీ కోసం..