కీరదోస‍తో ఇలా ఒక్కసారైనా  దోస వేసుకొని తిన్నండి  చాలా రుచిగా ఉంటుంది ...

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, కీరా దోస ముక్కలు - ఒకటిన్నర కప్పులు, 

జీలకర్ర - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు - రుచికి సరిపడా.

బియ్యాన్ని రెండు, మూడు గంటలు నానబెట్టి నీరంతా వడకట్టి మిక్సీలో వేసి కొంత మెదపాలి.

తర్వాత అందులోనే కీరా ముక్కలు, తురిమిన పచ్చికొబ్బరి, చిదిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ పిండినంతా ఒక పాత్రలోకి తీసుకొని అందులో జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. 

ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు పక్కనుంచి తర్వాత పెనంపై నూనె రాసి దోసెలుగా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి. 

వీటికి రైతా మంచి కాంబినేషన్‌.