కీరదోసతో ఇలా ఒక్కసారైనా
దోస వేసుకొని తిన్నండి
చాలా రుచిగా ఉంటుంది ...
కావలసిన పదార్థాలు: బియ్యం - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, కీరా దోస ముక్కలు - ఒకటిన్నర కప్పులు,
జీలకర్ర - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు - రుచికి సరిపడా.
బియ్యాన్ని రెండు, మూడు గంటలు నానబెట్టి నీరంతా వడకట్టి మిక్సీలో వేసి కొంత మెదపాలి.
తర్వాత అందులోనే కీరా ముక్కలు, తురిమిన పచ్చికొబ్బరి, చిదిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ పిండినంతా ఒక పాత్రలోకి తీసుకొని అందులో జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు పక్కనుంచి తర్వాత పెనంపై నూనె రాసి దోసెలుగా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి.
వీటికి రైతా మంచి కాంబినేషన్.
Related Web Stories
మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే మార్గాలు
ప్రభుత్వ జాబ్స్కు ప్రిపేరయ్యే వారు ఫాలో కావాల్సిన టిప్స్
పాము కాటేసినా ఈ జంతువులు చావవట..! తెలుసా..?
వేసవిలో ఈ పానీయాలు తాగితే ఎంతో ఉపశమనం