మహిళలు తప్పనిసరిగా  తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది..

వాస్తవానికి భారతీయ మహిళల్లో ప్రొటీన్ల లోపం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

దాదాపు 80 శాతం మంది మహిళలు ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నారట.

పురుషుకంటే మహిళలు 13 శాతం తక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నట్టు కూడా అధ్యయనాలు తేల్చాయి.

 మెనోపాజ్ ప్రారంభానికి ముందు దశలను వైద్యులు పెరీమెనోపాజ్ అని పిలుస్తారు. ఈ సమయంలో మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి.

కండరాలు బలహీనమవుతాయి. బరువు కూడా తగ్గిపోతారు.

ఇలాంటి సమయాల్లో మహిళకు పోషకాహారం ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

కేజీ బాడీ వెయిట్‌కు 1.2 గ్రాముల ప్రొటీన్  తీసుకోవాలని సూచిస్తున్నారు.

 దీంతో, కండరాలు కరగడం  తగ్గి, జీవక్రియలు  మెరుగవుతాయని చెబుతున్నారు.