అరటింపడు తిన్న తర్వాత కొన్ని పనులు చేయొద్దు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

అయితే అరటి పండు తిన్న తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

అరటి పండు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా చేస్తే గ్యాస్, అసిడిటీ, మలబద్ధక సమస్యలు తలెత్తుతాయి. 

అరటి పండు తిన్న గంట తర్వాత నీళ్లు తాగాలి. ఏ పండ్లు తిన్నా కూడా ఇలాగే చేయాలి.

అరటి పండు తిన్న వెంటనే పాలు, మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోకూడదు.

అరటి పండుతో కలిసి తేనె, నెయ్యి వంటివి కూడా తీసుకోవద్దు.

అరటి పండు తినగానే గుడ్లు కూడా తినకూడదుు. ఇలా చేయడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.