రాత్రి భోజనం ఆలస్యంగా తింటున్నారా..  ఈ సమస్యలు తప్పవు..

 రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

ఇది జీర్ణక్రియను చెడగొట్టడమే కాకుండా మానసిక స్థితి, నిద్రపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

నిపుణుల ప్రకారం సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య రాత్రి భోజనం చేయడానికి ఉత్తమ సమయం. 

ఈ సమయంలో రాత్రి భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. 

 హార్మోన్ల ఉపశమనం  కూడా మెరుగుపడుతుంది.

రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2-3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. 

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే జీర్ణక్రియ మందగించవచ్చు. కడుపు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.