Home » TOP NEWS
భూ భారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా.. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న. గవర్నర్కు ఫిర్యాదు చేసి బెంగళూరు అభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు
పీఎస్ఎల్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ పాలస్తీనా కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రతీ సిక్సర్ మరియు వికెట్కి రూ.లక్ష విరాళంగా ఇవ్వనున్నారు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు మహా కూటమి పార్టీల భేటీ ఈ నెల 17న జరగనుంది. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషణ
ఐపీఎల్లో బీసీసీఐ కొత్త అనుభూతి కోసం రోబో డాగ్ను ప్రవేశపెట్టింది. డానీ మారిసన్ వాయిస్ కమాండ్లకు అనుగుణంగా రోబో డాగ్ పరిగెత్తి ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసుకుంటూ అలరించింది
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్ కెల్లాగ్ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు
ఒలింపిక్ చాంపియన్ జర్మనీకి చెందిన లూకాస్ మార్టెన్స్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2009లో స్థాపించిన పాత రికార్డును 0.11 సెకన్ల తేడాతో అధిగమించాడు.
ఉన్నత విద్య, అనుభవం కలిగిన టెక్ నిపుణులకు దక్షిణ కొరియా టాప్ టైర్ వీసాతో శాశ్వత నివాసం సహా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. హైటెక్ కంపెనీల్లో పని చేయాలని ఆకాంక్షించే వారికి ఇది గొప్ప అవకాశం
అమెరికా తాజా సుంకాల ప్రభావం తాత్కాలికమని, భారత ఐటీ రంగంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చైనా కంటే భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చౌకగా ఉండడం కూడా మనకు లాభం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
నిస్సాన్ భారత మార్కెట్ కోసం 2027 నాటికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే 7 సీట్ల ఎంపీవీ, 5 సీట్ల ఎస్యూవీలను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది