‘తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టు కనిపిస్తోంది’

ABN , First Publish Date - 2021-12-13T22:38:28+05:30 IST

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్నేహితుడు లక్ష్మీనారాయణ ఇంటిపై సీబీఐ దాడులు జరిగితే పరామర్శకి వెళ్ళిన రాధాకృష్ణపై కేసులు పెట్టారని మండిపడ్డారు.

‘తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టు కనిపిస్తోంది’

అమరావతి: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని  టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్నేహితుడు లక్ష్మీనారాయణ ఇంటిపై సీబీఐ దాడులు జరిగితే పరామర్శకి వెళ్ళిన రాధాకృష్ణపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కేవలం జగన్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపిస్తున్న కారణంగానే ఈ అక్రమ కేసులన్నారు. దాదాపు సంఘటన జరిగిన 30 గంటల తర్వాత జీరో ఎఫ్ఐఆర్ వేసి అక్రమ కేసులు పెట్టడం చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టు కనిపిస్తోందన్నారు. వేమూరి రాధాకృష్ణ మాట్లాడిన మాటలు, ఆయన కదలికలు స్పష్టంగా వీడియోలో రికార్డింగ్ చేసి ఉన్నాయన్నారు. రాధాకృష్ణ ఏ తప్పు చేయలేదనడానికి అవే సాక్ష్యాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-13T22:38:28+05:30 IST