షర్మిల ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు
ABN , First Publish Date - 2022-02-28T16:50:34+05:30 IST
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. మార్చ్ 10 నుంచి పాదయాత్ర పునఃప్రారంభం కానున్నట్లు షర్మిల ప్రకటించారు. నల్గొండ జిల్లా కొండపాక గూడెం గ్రామం నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. గత ఏడాది డిసెంబర్ 9న ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం వద్ద షర్మిల పాదయాత్ర ఆగిన విషయం తెలిసిందే.