కేసీఆర్ మనసు మార్చాలని మొక్కుకున్న: షర్మిల

ABN , First Publish Date - 2022-02-03T21:15:31+05:30 IST

మేడారంలో సమ్మక్క సారలమ్మలను వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

కేసీఆర్ మనసు మార్చాలని మొక్కుకున్న: షర్మిల

ములుగు: మేడారంలో సమ్మక్క సారలమ్మలను వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనసు మార్చాలని అమ్మలను మొక్కుకున్నానన్నారు. అడవి బిడ్డల మీద ప్రేమ చూపేలా సీఎం కేసీఆర్ మనస్సు మార్చాలని ఆ సమ్మక్క సారాలమ్మ తల్లులను వేడుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇచ్చేలా చూడాలని కోరుకున్నానన్నారు. ఆదివాసీల పొడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న సాగుదారులకు హక్కులు కల్పించాలని, రైతుబందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆత్మహత్యలు ఆపేలా చూడాలని, కేసీఆర్ కళ్ళు తెరిపించాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. 

Updated Date - 2022-02-03T21:15:31+05:30 IST