కరోనాతో చదువులు సాగింది లేదు: షర్మిల

ABN , First Publish Date - 2021-12-18T19:29:08+05:30 IST

రోనాతో చదువులు సాగింది లేదు, ఆన్‌లైన్ సౌకర్యం లేక పాఠాలు అందింది లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనాతో చదువులు సాగింది లేదు: షర్మిల

హైదరాబాద్: కరోనాతో చదువులు సాగింది లేదు, ఆన్‌లైన్ సౌకర్యం లేక పాఠాలు అందింది లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంటర్ సెంకడ్ ఇయర్‌కు ప్రమోట్ చేశాక మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షలన్నారు. నెల రోజుల్లో పరీక్షలు పెట్టి ప్రిపరేషన్‌కు టైం ఇవ్వకుండా  విద్యార్థులు ఫెయిల్ అయ్యేలా చేశారు.మీ అనాలోచిత నిర్ణయాలకు 2లక్షల మంది విద్యార్థుల జీవితాలు బలయ్యేలా చేశారు. ముగ్గురు విద్యార్థుల చావులకు  కారణమయ్యారు. మరింత మంది విద్యార్థులు మరణించక ముందే కనీసం గ్రేస్ మార్కులైన వేసి పాసయ్యే అవకాశం కల్పించాలి’’ అని వైఎస్ షర్మిల తెలిపారు.

Updated Date - 2021-12-18T19:29:08+05:30 IST