నీళ్లు కేసీఆర్ ఇంటికి, నియామకాలు ప్రగతి భవన్కి, నిధులు..: షర్మిల
ABN , First Publish Date - 2021-08-11T19:12:50+05:30 IST
తెలంగాణలో ఎవరైనా సంపాదించుకున్నారంటే అది సీఎం కేసీఆర్ కుటుంబమేనని వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎవరైనా సంపాదించుకున్నారంటే అది సీఎం కేసీఆర్ కుటుంబమేనని వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రాజెక్ట్ల పేరుతో భారీగా సంపాదించుకున్నారన్నారు. నీళ్లు కేసీఆర్ ఇంటికి, నియామకాలు ప్రగతి భవన్కి, నిధులు ఆయన కుటుంబానికి అని షర్మిల ఎద్దేవా చేశారు. ఉద్యోగులు భయంతో బతుకుతున్నారన్నారు. ఉద్యోగం ఇవ్వని చేతకాని సీఎంకి తీసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. దొర దగ్గరకు పోవాలంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదపన్నారు. సీఎం కేసీఆర్ మహిళలను కుక్కలతో పోలుస్తారన్నారు. మీరు ప్రజలకు సేవకులు, ప్రశ్నిస్తే ఎందుకు అహసనమని షర్మిల ప్రశ్నించారు.