సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

ABN , First Publish Date - 2021-12-21T22:25:20+05:30 IST

ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 70 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

రాజన్న సిరిసిల్ల: ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 70 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రైతు కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా? అని ఆమె ప్రశ్నించారు. ధాన్యం కొనలేని సీఎం మనకు అవసరమా?, కేంద్రం దగ్గర సీఎం కేసీఆర్ సంతకాలు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగాని తనంవల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకు అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-21T22:25:20+05:30 IST